పెద్దాపురంకు చెందిన పెనుమర్తి వెంకట పద్మావతి, నిత్య అన్నదాన ట్రస్ట్కు రూ. 1 లక్ష విరాళంగా అందజేశారు. ఈ అన్నదానం పెనుమర్తి గోవిందరాజు గారి పేరుతో నిర్వహించాలని ఆమె కోరారు. విరాళం అనంతరం ఆలయ అసిస్టెంట్ పీఆర్ఓ గణపతి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం, శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు.