గోదావరి నదిలో మురుగు నీరు లేదా పరిశ్రమల రసాయనిక పదార్థాలను కలిపితే సహించేది లేదని, అలాంటి చర్యలకు పాల్పడితే యాజమాన్యాలను జైలుకు పంపిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ హెచ్చరించారు. బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, లాకౌట్ చేస్తాం, మూసేస్తామనే బెదిరింపులకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు.