ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. DEO డాక్టర్ వసుంధర, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పొగాకు వినియోగం ప్రపంచ ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని, దీనికి దూరంగా ఉండాలని డాక్టర్ వసుంధర పిలుపునిచ్చారు.