2027 గోదావరి పుష్కరాల సందర్భంగా మునికూడలిలోని దేవన్ష్ ఘాట్ను మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్గా అభివృద్ధి చేయడానికి కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం జేసీ వై. మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ ఘాట్ను పరిశీలించారు. పుష్కరాల సమయంలో యాత్రికులకు ఈ ఘాట్ ప్రధాన కేంద్రంగా మారనుంది.