రాజమండ్రిలోని వివిధ పెట్రోల్ బంకులను సోమవారం జేసీ వై. మేఘా స్వరూప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల్లో ఇంధన సరఫరాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ఈ తనిఖీల లక్ష్యమని తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద రోజువారీ వినియోగం, ప్రస్తుత డిమాండ్, నిల్వల పరిస్థితి వంటి అంశాలను సమీక్షించారు.