రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో నవంబర్ 1వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులై, 35 ఏళ్ల లోపు వయసు ఉన్న అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.