నాలుగు పదుల వయసు, అంగవైకల్యం, వివాహం కాకపోవడంతో మనస్తాపం చెందిన పి.శ్రీనివాస్ (40) అనే వ్యక్తి కూకట్పల్లిలో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమహేంద్రవరంకు చెందిన శ్రీనివాస్, హైదరాబాద్లో ఒంటరిగా నివాసం ఉంటూ స్కిన్ కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. వివాహం చేసుకోలేకపోతున్నాననే బాధతో, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.