తూ. గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం నవంబర్ 7వ తేదీన రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని PGRS హాల్లో రెడ్క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తూ. గో జిల్లా యూనిట్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహిస్తారు. జిల్లా రెడ్క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.