రాజమండ్రిలో 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రబృందం సందడి చేసింది. సినిమా విజయవంతమైన నేపథ్యంలో హీరో అఖిల్, హీరోయిన్ తేజస్విని, నిర్మాత రాహుల్, నటుడు చైతు జొన్నలగడ్డ శనివారం సాయంత్రం నగరంలోని ఊర్వశి థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే హీరో, హీరోయిన్లు వేదికపై డ్యాన్స్లు వేసి అభిమానులను ఉత్సాహపరిచారు.