కడియం మండలం దుళ్ల రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం జాతీయ సేవా పథకం కార్యక్రమం జరిగింది. రాజమండ్రి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి. ఎ. విశాలాక్షి దేవి రైతులకు మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. మితిమీరిన పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల పంటకు కలిగే నష్టాలను ఆమె వివరించారు.