తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నారా
లోకేశ్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువ నాయకత్వంలో పార్టీ మరింత ఉత్తేజంతో ముందుకు సాగుతుందని, నూతన కార్యవర్గ సమష్టి కృషితో రాష్ట్రంలో
టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.