కడియంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం PMDS విత్తన గుళికల తయారీ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ (NFA) పి. గౌతమ్ మాట్లాడుతూ, కోతలు పూర్తయ్యాక భూమిని ఖాళీగా ఉంచడం వల్ల పోషకాలు ఆవిరైపోతాయని, వేసవి తాపానికి సూక్ష్మజీవులు నశించే ప్రమాదం ఉందని, నీటి కొరత వల్ల నేరుగా విత్తిన విత్తనాలు మొలకెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విత్తన గుళికల తయారీ ప్రాముఖ్యతను వివరించారు.