తూ. గో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రిలోని A. P. పేపర్ మిల్స్ లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం 1986' పై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను, కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని, కాలుష్యం వల్ల కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.