రాష్ట్ర యువతకు
ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణను క్రమబద్ధంగా ఉద్యోగ కల్పనకు అనుసంధానం చేయాలని
బీజేపీ జనతా వారధి జిల్లా కన్వీనర్ కృష్ణరాజు కోరారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద జరిగిన PGRSలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం చేతివృత్తులకు గౌరవం, యువతకు భరోసా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనతా వారిది కో కన్వీనర్ యనాపు ఏసు, స్వామి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు.