రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తం 21 మంది ఉద్యోగులు తమ ఫిర్యాదులను సమర్పించారు.