తూ. గో జిల్లాలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలు పెంచేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మేధోమథనం (బ్రెయిన్స్టార్మింగ్) సెషన్లో ఆమె మాట్లాడుతూ, అకాడమిక్ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తేనే యువతకు
ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొన్నారు.