రాజమండ్రి ఊర్వశి థియేటర్లో శనివారం ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర యూనిట్ సందడి చేసింది. విజయోత్సవం సందర్భంగా హీరో అఖిల్, హీరోయిన్ తేజస్విని, నిర్మాత రాహుల్, నటుడు చైతు జొన్నలగడ్డ ప్రేక్షకులతో కలిసి మాట్లాడి వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులను అలరించేందుకు హీరో–హీరోయిన్లు వేదికపై డ్యాన్స్లు చేయగా, థియేటర్ మొత్తం ఉత్సాహంతో మార్మోగింది.