తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సాటిలైట్ సిటీలో ఆదివారం జరిగిన
క్రికెట్ టోర్నమెంట్ ను వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ తూ.గోజిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ విలువైన ఖాళీ సమయాన్ని క్రీడలతో సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని, శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. క్రీడలకు సమయం కేటాయిస్తే జీవితంలో ఒక నిబద్ధత కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.