గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని శ్రీ ఉమా లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి హుండీని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. ఆలయ ఛైర్మన్ ఫిర్యాదుతో గోకవరం ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో, అదే గ్రామానికి చెందిన గుర్రం అదిత్య సాయికుమార్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి, అతన్ని అరెస్టు చేశారు.