రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఇటీవల వరదలకు గురైన ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పునరావాస కేంద్రంలో బాధితులను పలకరించి, వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను వారికి అందజేశారు.