రాజానగరం మండలంలోని దివాన్ చెరువు వద్ద గురువారం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసనలు చేపట్టారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.