వైసీపీ నేత అంబటి రాంబాబుకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు వెళ్తున్న జక్కంపూడి కుటుంబ సభ్యులను పోలీసులు ఆదివారం ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన నాయకులు జక్కంపూడి గణేష్లను సీతానగరంలోని వారి నివాసంలోనే పోలీసులు అడ్డుకున్నారు.