రామచంద్రపురం: అయిదో తరగతి చిన్నారి ఉరేసుకుని ఆత్మహత్య

5చూసినవారు
రామచంద్రపురం: అయిదో తరగతి చిన్నారి ఉరేసుకుని ఆత్మహత్య
రామచంద్రపురం పట్టణంలో పదేళ్ల బాలిక రంజిత (హనీ) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి సునీత కాకినాడలో ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక ఈ దారుణానికి పాల్పడింది. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా, బాలిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, బాలిక మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్