కే. గంగవరం మండలం కోటిపల్లిలంకలలో పంట భూములను సాగు చేసేందుకు పి. గన్నవరం మండలం వీరవల్లిపాలెం రైతులు ప్రతిరోజు ఉదయాన్నే పడవలపై వెళ్తుంటారు. ఆదివారం స్వల్పంగా మంచు కురవడంతో పాటు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తేలికపాటి చినుకులు పడటంతో రైతులు పశుగ్రాసం తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.