సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో నవంబర్ 4వ తేదీన లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మహా శాంతి హోమం నిర్వహించనున్నారు. ఈ హోమం నిర్వహణ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. అనంతరం దేవాలయ అధికారులు, స్థానిక నేతలతో సమావేశమై, మహాశాంతి హోమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.