రాజోలు మండలంలోని తాటిపాక అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా ఉన్న గాయత్రి అపార్ట్మెంట్లో మంగళవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వాలు స్వీకరించారు.