మలికిపురం మండలం లక్కవరం ఎంజీ గార్డెన్స్లో గురువారం జరిగిన రాజోలు నియోజకవర్గ
టీడీపీ సంస్థాగత పదవుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఇటీవల ఎన్నికైన పార్టీ సంస్థాగత పదవులు పొందిన నాయకులు మరియు క్యూబ్స్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఇతర
టీడీపీ నేతలు పాల్గొన్నారు.