మలికిపురం మండలం గుడిమెళ్ళంకలో రూ. 5 కోట్ల ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో 6 ఎంఎల్డి సామర్థ్యం గల 'ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్' (RSF) ప్లాంట్ నిర్మాణ పనులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ ఆధునిక ప్లాంట్ ద్వారా పాత ఫిల్టర్ల సమస్యను అధిగమించి, ప్రతిరోజూ శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యమని, సుమారు 9 నెలల్లో పనులు పూర్తి చేసి, వచ్చే మార్చి నాటికి 29 పంచాయతీలకు మెరుగైన తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.