తుని ఎమ్మెల్యే యనమల దివ్య గురువారం తేటగుంటలోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలతో పాటు తుని పట్టణానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ. 15.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.