
బీజేపీ నాయకులు హెల్త్ సెంటర్ ను సందర్శించి, వసతులపై ఆరా తీశారు
రాజమండ్రి రూరల్ కాతేరు సచివాలయం 5 వద్ద ఉన్న హెల్త్ సెంటర్ ను బుధవారం బీజేపీ నాయకులు సందర్శించారు. జిల్లా సెక్రెటరీ స్వామి నాయకత్వంలో, నాయకులు హెల్త్ సెంటర్ లో మౌలిక వసతులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పనివేళల్లో వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ నాగుల శివకుమార్, మండల ప్రధాన కార్యదర్శి కండెలి సురేష్, మండల వైస్ ప్రెసిడెంట్ పిచ్చుక రాంబాబు పాల్గొన్నారు.




































