రాజానగరం - Rajanagaram

రాజానగరం: తోటలో పులి పాదముద్రలు

రాజానగరం: తోటలో పులి పాదముద్రలు

విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారికి సమీపంలో రఘునాథపురంలోని ఓ తోటలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామంలో గేదె కళేబరం లభించడంతో, దాని లేగదూడను పులి తీసుకెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. పులిని బంధించడానికి ట్రాప్ కెమెరా, బోను సిద్ధం చేశారు. పుణె నుంచి నిపుణుల బృందం బయల్దేరింది. ఎన్టీసీఏ రాజశేఖర్ బృందం, అటవీశాఖ అధికారులు మంగళవారం నుంచి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎఫ్. బీఎన్ఎన్ మూర్తి, డీఎఫ్ వో ప్రభాకర్ రావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గావీదు రాజు, స్క్వాడ్ డీఎఫ్ శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పల్లా శ్రీనివాస్ తో పాటు 30 మంది సిబ్బంది పులిని బంధించడానికి చర్యలు చేపట్టారు.

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
భారతీయ వ్యక్తికి అమెరికాలో జైలు శిక్ష
Feb 04, 2026, 16:02 IST/

భారతీయ వ్యక్తికి అమెరికాలో జైలు శిక్ష

Feb 04, 2026, 16:02 IST
అమెరికాలో ఒక దేశీయ విమాన ప్రయాణంలో మహిళా ప్రయాణికురాలిపై అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు 38 ఏళ్ల భారతీయ పౌరుడు వరుణ్ అరోరాను ఫెడరల్ జ్యూరీ దోషిగా తేల్చింది. ఆగస్టు 29, 2024న రోడ్ ఐలాండ్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు వరుణ్ ప్రస్తుతం అమెరికాలో సరైన వీసా లేకుండా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అభ్యంతరకర ప్రవర్తనకు ఆయనకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మే 7వ తేదీన ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించనున్నారు. శిక్ష అనంతరం నిందితుడిని భారత్‌కు పంపించే అవకాశాలు  ఉన్నాయి.