రంగంపేట మండలం - Rangampeta Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
Dec 23, 2025, 11:12 IST/

బంగారం ధరలు మరింత పెరుగుతాయా?

Dec 23, 2025, 11:12 IST
దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఒక దశలో లక్షా 37వేల రూపాయలు దాటిన పసిడి ధర, వచ్చే ఏడాది 15 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గోల్డ్‌మన్‌ సాచ్స్‌ సంస్థ 2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర లక్షన్నర దాటవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ధరల పెరుగుదలకు కారణాలని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) చెబుతోంది. అయితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంటే ధరలు తగ్గే అవకాశం ఉందని కూడా WGC తెలిపింది.