కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ చేసి, తర్వాత వేడి చేసి తినడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాన్-వెజ్ విషయంలో ఈ తప్పు చేయవద్దని చెబుతున్నారు. అన్నం, బంగాళాదుంపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలకూర వంటి వాటిలో బాక్టీరియా పెరిగిపోయే అవకాశాలున్నాయని, దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. కాబట్టి, ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తినడమే ఉత్తమమని సూచిస్తున్నారు.