APSRTCలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై నెలకొన్న అపోహలపై యాజమాన్యం స్పష్టతనిచ్చింది. సంస్థ ప్రైవేటీకరణ అవుతుందనే ప్రచారాలను ఖండించిన అధికారులు, విద్యుత్ బస్సులు కేవలం మెరుగైన సేవలందించడానికేనని, ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-బస్ సేవా’ పథకం కింద 1,050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వీటిలో 750 బస్సులు మొదటి దశలో ప్రధాన నగరాల్లో ప్రవేశపెట్టబడతాయి. పర్యావరణహిత రవాణా, కాలుష్య నియంత్రణ, డీజిల్ ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా ఈ బస్సులు నడపబడతాయి.