భారీ వర్షాల కారణంగా ముంబై అస్తవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో నెరూల్లోని ఎల్పీ బ్రిడ్జి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు విద్యుత్ షాక్కు గురయ్యారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చెట్టు కొమ్మ సహాయంతో.. వారికి విద్యుత్ షాక్ తగలకుండా చేశారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.