ఏనుగు దంతాల వివాదం.. చిక్కుల్లో మోహన్‌ లాల్‌

13214చూసినవారు
ఏనుగు దంతాల వివాదం.. చిక్కుల్లో మోహన్‌ లాల్‌
నటుడు మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2011లో స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల వ్యవహారంలో 2012లో కేసు నమోదైంది. తాజాగా, మోహన్‌లాల్ తన వద్ద ఉన్న ఏనుగు దంతపు వస్తువులను అధికారికంగా ప్రకటించడానికి కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక క్షమాభిక్ష పథకాన్ని ఆశ్రయించారు. ఈ ప్రక్రియ ద్వారా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ క్షమాభిక్ష పథకం చట్టబద్ధతపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్