భీమవరం PSM గర్ల్స్ హైస్కూల్లో ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సివిల్ జడ్జి సీ. రమ్య మాట్లాడుతూ, చదువుకునే వయస్సులో పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూటన్, అంబేద్కర్, వెంకటరమణ, ఉష, సునీత, SI కిరణ్ కుమార్, పాఠశాల HM సాయి ప్రసాద్, నాగేంద్ర కుమార్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.