రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆబోతుల యాశ్వంత్ కు సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, వారి మిత్ర బృందం రూ. 1,50,000 ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, బాధితులకు అండగా నిలవడం మానవత్వమని ఎమ్మెల్యే తెలిపారు.