జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమరారం చౌదరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో వాహనం బైక్, సైకిల్తో పాటు ఒక పాదచారిని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు, బేతాళ వెంకటపతి అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.