జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో చందన తెలిపిన వివరాల ప్రకారం, స్వామివారికి విశేష పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వివిధ రూపాలలో ఒక్కరోజు ఆదాయంగా ₹. 3,02,539 సమకూరిందని తెలిపారు.