లింగపాలెం శివారు జూబ్లీ నగర్ వద్ద సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో అయ్యప్పరాజుగూడెం గ్రామానికి చెందిన వీరంకి ప్రవీణ్ (25) మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకన్నబాబు, ఎమ్మెల్యే రోషన్, క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలను ఆరా తీస్తున్నారు.