లగూడెంలోని బస్టాండు సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తూలి పడటంతో ఆదివారం ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడికి తలకు బలమైన గాయం కాగా, అతను గోపాలపురం మండలం గుడ్డిగూడెం వాసిగా గుర్తించారు. వాహనంపై పడిన వ్యక్తి బిహార్ రాష్ట్రానికి చెందినవాడని చెబుతున్నారు. ఇరువురిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.