పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ నియామకంపై బాలరాజు మాట్లాడుతూ, గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని శనివారం తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం పట్ల నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నియామకం ద్వారా గిరిజనుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.