త్రాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఏలూరు 4వ డివిజన్ మారుతీ నగర్లో నూతనంగా నిర్మిస్తోన్న రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగానే ఆ ప్రాంతంలోని ప్రజలు తమ రోడ్డుకు కూడా డ్రైన్ వ్యవస్థను అనుసంధానం చేయాలని కోరడంతో ఆ దిశగా ఎమ్మెల్యే అడుగులు వేశారు.