ఏలూరు: దంపతులం అంటూ అద్దెకు.. ఉదయం భార్య మృతి
ఏలూరు టూ టౌన్ చాణిక్యపురి కాలనీలో మంగళవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ అశోక్ కుమార్, నెల రోజుల క్రితం దంపతులం అంటూ అద్దెకు వచ్చిన వారి వివరాలు తెలియదని, పెయింటింగ్ వర్క్ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
