ఏలూరు జిల్లాలో తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకునే షెడ్యూల్ కులాల
విద్యార్థులు తప్పనిసరిగా ఎస్బీఐ లేదా యూపీఐ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీలోపు ఖాతా తెరిచి, ఎన్పీసీఐ లింక్ చేయించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9502228533 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.