ఏలూరులోని వంగాయగూడెంలో HIV బాధితుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయల విలువైన భవనం, స్థలం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2011లో అప్పటి కలెక్టర్ వాణి ప్రసాద్ దీనిని నిర్మించగా, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దీన్ని స్వాధీనం చేసుకుని ప్రస్తుతం సొంత అవసరాలకు వాడుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.