ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శని కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.