శనివారం పట్టణంలోని ఆటోనగర్లోని ఓ ఇంజినీరింగ్ వర్క్షాప్లో పాత ఇనుప సామగ్రిని తరలిస్తున్నప్పుడు భారీ పాము కలకలం సృష్టించింది. కార్మికులు ఇనుప రేకు కింద ఏడు అడుగుల గోధుమ తాచుపామును గుర్తించారు. యజమాని సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షుడు చదలవాడ క్రాంతి, పామును చాకచక్యంగా పట్టుకున్నారు.