తీగలవంచలో బుధవారం నిర్వహించిన 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమంలో ఎస్సై జయబాబు వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు, మహిళా కూలీలకు రహదారి నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.